కులగణనే బీసీల ప్రధాన డిమాండ్ – గుజ్జ సత్యం బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు
కులగణన చేయడం బీసీల ప్రధాన డిమాండ్ అని, కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేక వైఖరి అవలంభిస్తోందని, మార్చుకోకపోతే జాతీయ స్థాయిలో లక్షలాది మంది బీసీలతో ఉద్యమం ఉదృతం చేస్తామని రా జ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించా. గుజ్జు సత్యం ఆధ్వర్యంలో మంగళవారం కాచిగూ డలో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ జిల్లేపల్లి కిరణ్ న్ను నియమిస్తూ, నియామక పత్రాన్ని ఆర్.కృష్ణయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, చట్ట సభల్లో 50 శాతం రిజర్వే షన్లు కల్పించాలని డిమాండ్ చేశారుస్వాతంత్రం వచ్చి 75 యేండ్లు దాటిన బీసీలకు విద్యాఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో న్యాయం జరడంలేదని, బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులను కల్పిం చకుండా మోదీ ప్రభుత్వం అణిచివేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అధ్యక్షులు ఎర్ర సత్యం గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురేష్ జల్లేపల్లి కిరణ్ యువజన నాయకులు నివాస్, తదితరులు పాల్గొన్నారు.. తదితరులు పాల్గొన్నారు.