News

ఆధునిక బీసీల యుగకర్త బీపీ మండల్ – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం.

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం

బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి ఆధునిక అభివృద్ధిలో వారి వాటా వాళ్ళకే దక్కాలని సిఫార్సు చేసిన ఆధునిక బీసీల యుగకర్త బీపీ మండల్ అని బీసీల అభివృద్ధికై మండల్ రిపోర్టు ను ఒక బీసీ రాజ్యాంగంగా, బీసీల అభివృద్ధి రాజ్యాంగంగా గుర్తించాలని అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓబీసీలకు మండల్ ద్వారానే ఒక గుర్తింపు దొరికిందని, రిజర్వేషన్ల రూపంలో విద్య, ఉద్యోగ రంగాలలో ప్రవేశించడం మొదలైందని, కానీ మండల్ చేసిన 40 సిఫారసులలో రిజర్వేషన్ అనే ఒకే ఒక్క అంశం ఉద్యమ రూపంలో ముందుకు వచ్చింది. మిగిలిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వంప పట్టించుకోవడం లేదని అన్నారు.

B. P. మండల్ గారి జన్మ దినం ఈ రోజు ఆగస్టు 25 న కావున అతని జన్మదినన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా “రాష్ట్రీయ బహుజన సాధికారత దివాస్ “గా జరపాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *