HealthNews

సత్యం హోమియోపతి వారి ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

ఎల్ బినగర్: ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎల్ పిటి షాపింగ్ కాంప్లెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ తడక వెంకటేష్ అన్నారు. శనివారం *కొత్తపేట డాక్టర్స్ కాలనీ లోని శ్రీ లక్ష్మి వైట్ హౌస్* ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిర కేంద్రాన్ని వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై తడక రమేష్, పెద్ది జగదీష్ , సత్యం హోమియోపతి చైర్మన్ గుజ్జసత్యం, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం *సత్యం* మాట్లాడుతూ *మా హోమియోపతి ఆసుపత్రిలో పేద, మధ్య తరగతి ప్రజలందరికీ అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ వైద్య సేవలు* అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా *ప్రతీ నెల మొదటి వారం రోజుల పాటు ఎటువంటి కన్సల్టెన్సీ ఫీజు లేకుండా ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందుల పంపిణీ చేస్తున్నట్లు* చెప్పారు. ఈ సౌకర్యాన్ని వీలైనంత ఎక్కువ మంది ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నామని అన్నారు. హోమియోపతి మందులు అన్ని వయసుల వారికి, ఎటువంటి వ్యాధి అయినను వాడవచ్చు మరియు ఈ మందుల వలన ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా సంపూర్ణంగా వ్యాధి మూలాల నుండి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ఈ సౌకర్యాన్ని పొందటానికి మరిన్ని వివరాల కొరకు ఈ 9121218585 నెంబర్ సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో కస్తూరి సుదర్శన్, కుడికల బాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *