శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి
శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి
కావలసిన పదార్దాలు –
* పచ్చ పెసలు – 1 కిలొ .
* బావంచాలు – 100 గ్రాములు .
* వట్టి వేళ్లు – 100 గ్రాములు .
* కచ్చురాలు – 100 గ్రాములు .
* మంజిష్ట – 100 గ్రాములు .
* మంచి పసుపు – 100 గ్రాములు .
* కస్తూరి పసుపు – 100 గ్రాములు .
* ఉలవలు – 100 గ్రాములు .
* బత్తాయి తొక్కలు – 100 గ్రాములు .
* కరక్కాయ బెరడు – 100 గ్రాములు .
* ఉసిరికాయ బెరడు – 100 గ్రాములు .
* తానికాయ బెరడు – 100 గ్రాములు .
* ఎండు ఖర్జూరాలు – 100 గ్రాములు .
* కుంకుడు కాయ పెచ్చులు – 100 గ్రాములు
* సుగంధపాల వ్రేళ్లు – 100 గ్రాములు .
* తుంగ గడ్డలు – 100 గ్రాములు .
* దానిమ్మ పండ్ల బెరడు – 100 గ్రాములు .
* ఎండు గులాబీ రేకులు – 100 గ్రాములు .
* మరువము – 100 గ్రాములు .
* ధవనము – 100 గ్రాములు .
* జాపత్రి – 100 గ్రాములు .
* యాలుకలు – 100 గ్రాములు .
* కురువేరు – 100 గ్రాములు .
* తులసి ఆకులు – 100 గ్రాములు .
తయారీ విధానం –
పచ్చ పెసలు చిన్న మంట పైన కళాయిలో
పోసి కొద్దిగా నెయ్యివేసి దోరగా వేయించి దించి విసిరి బరక బరకగా పిండి తయారుచేసుకోవాలి . దానిలో పైన చెప్పిన పదార్దాలను శుద్ది చేసుకుని సరైన మోతాదుల్లో విడివిడిగా చూర్ణాలు మెత్తగా చేసుకుని పెసరపిండిలో కలుపుకోవాలి.
వాడేవిధానం –
స్నానానికి అరగంట ముందు ఈ సున్నిపిండిని తగినంత తీసుకుని పుల్లటి మజ్జిగతో కలిపి మెత్తగా పిసికి శరీరం అంతా రుద్దుకోవాలి . ఆరిన తరువాత ఒక్కో భాగాన్ని రుద్దుతూ స్నానం చేయాలి . ఈ సున్ని పిండి రాసుకోవడానికి అర్ధ గంట ముందు నువ్వులనూనెని శరీరముకి పట్టించి ఈ సున్నిపిండి రుద్దుకొని స్నానం ఆచరించిన అద్బుత ఫలితాలు వస్తాయి. స్నానానికి గోరువెచ్చటి నీటిని వాడిన చాలా మంచిది .
ఉపయోగాలు –
* ఈ సున్నిపిండి ఉదయం , సాయంత్రం వాడటం వలన శరీరం నందలి 7 పొరలు శుద్ది చెందును .
* శరీరం లోపలి భాగంలోని మలినాలు బహిష్కరించబడతాయి .
* చర్మం పైన మచ్చలు , చారలు , పగుళ్లు , పుండ్లు , దురదలు , దద్దుర్లు , వాపులు హరించును .
* మృత చర్మ కణాలు నిర్మూలించబడతాయి .
* చర్మానికి సహజకాంతి వృద్ది చెందును .
* శరీర నల్లధనం , మొటిమల సమస్యలు నివారించబడును.
* శరీరానికి మంచి తేజస్సు కలుగును.
* సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కలవారికి అద్బుతంగా పనిచేయును .
గమనిక –
పైన చెప్పిన విధానం మీరు చేసుకోలేనిచో చేసి ఇవ్వబడును