News

కావాలని మోడీ గాడు అనలేదు !

ప్రధాని మోడీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ గాడు అని సంబోధించిన విషయం దేశవ్యాప్తంగా వైరల్ అవడంతో అదే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయం గురించి తానూ వివరణ తీసుకునేందుకు కేటీఆర్ తో మాట్లాడానంటూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో చెప్పినప్పటినుంచి… దీని పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ అంశం గురించి టీఆర్ఎస్ ఎంపీ, తెరాస అధినేత కుమార్తె అయిన కవిత స్పందించారు.

ప్రధాని మోదీని ఉద్దేశ్యపూర్వకంగా అవమానించాలనే ఉద్దేశం కేసీఆర్ కు ఏ కోశానా లేదని… కేసీఆర్ ది అలాంటి సంకుచిత స్వభావం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రసంగంలో కావాలని అలా అనలేదని ఏదో ఫ్లోలో అలా వచ్చేసిందని ఆమె అన్నారు. మాటల మధ్య పొరపాట్లు దొర్లడం సహజం అని చిన్న పొరపాటును బీజేపీ

నేతలు పెద్దది చేయాలనుకోవడం సరికాదని కవిత అన్నారు.

రైతులకి జరుగుతున్న అన్యాయం, రైతుల పట్ల ఆవేదనతోనే

కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారని ఎంపి కవిత అన్నారు.

ఇదే సమయంలో ఎపీకి ప్రత్యేక హోదా మీద కూడా ఆమె స్పందించారు. హోదా విషయంలో 2014 నుంచే ఏపీకి తాము మద్దతు ఇస్తున్నామని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *