చలో ఢిల్లీని విజయవంతం చేయాలి:గుజ్జ సత్యం
చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. ఏప్రిల్ నెల 3, 4 వ తేదీల్లో చట్టసభలో బీసీల రిజర్వేషన్లు 52 శాతం కల్పించాలనీ, బీసీ ఉద్యోగుల ప్రొమోషనలలో రిజర్వేషన్ అమలు చేయాలనీ, బీసీ క్రిమిలేయరు ఎత్తివేయాలని ఢిల్లీలో భారీ ఎత్తున నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి పోరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అన్ని జిల్లాల నుండి 5000మందికి పైగా భారీ ఎత్తున తరలివస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ హాజరై బీసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు డా పురుషోత్తం ,చౌటు పల్లి సురేశ్, బిళ్ళ పండరినాథ్, మంగళపల్లి రమేశ్, జయరాజ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.